రన్వే నుంచి జారిన విమానం
జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న లయన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం రన్వేపై నుంచి జారి సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానంలో నూరుమంది ప్రయాణీకులు, సిబ్బంది వున్నారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి ప్రయాణీకులను సిబ్బందిని విమానం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని బాలి అధికార వర్గాలు వెల్లడించాయి.