రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

హైదరాబాద్‌:ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమినర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.నిబందనలకు విరుద్దంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.ఇప్పటివరకు 356 ప్రైవేటు ట్రావెల్స్‌ 1518 పాఠశాల బస్సులు స్వాదీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.1849పాఠశాల బస్సులపై ఆయా కోర్టుల్లో చార్జిషీటు దాఖలుచేయనున్నట్లు సంజయ్‌కుమార్‌ తెలిపారు.