రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు
ఢిల్లీ: దేశంలో సుమారు పది ప్రధాన రాజకీయ పార్టీలు రూ. 2,490 కోట్ల మేరకు పన్ను మినహాయింపు పొందాయని ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా వెల్లడించారు. ఇందులో 80శాతం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొందినవే. ఇక రూ 20,000 తక్కువ విరాళాలను లెక్కల్లో చూపలేదు, భారీ సంఖ్యలో చిన్న విరాళాలు అందినప్పటికి ఆదాయపు ఖాతాలో చూపలేదు. కాంగ్రెస్ రూ. 138536 కోట్లు మినహాయింపు పొందగా బీజేపీ రూ.682కోట్లు మినహాయింపు పొందింది. 2007-11 మధ్యలో ఈ మినహాయింపులు చోటు చేసుకున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ రూ.15.51కోట్లు మినహాయింపు పొందగా బీఎస్పీ రూ.147.18 కోట్లు మినహాయింపు పొందింది. సీపీఎం రూ.85.61కోట్లు మినహాయింపు పొందింది. సీపీఐ రూ.28.47కోట్లు మాత్రమే మినహాయింపు పొందింది.
నాటో స్థావరంపై తాలిబన్ల దాడి
కాబూల్: అప్ఘనిస్తాన్లోని ప్రధాన నాటో స్థావరంపై ఆదివారం జరిగిన తాలిబన్ దాడిలో 11మంది మరణించారు. బాంబులను శరీరానికి కట్టుకున్న తాలిబన్లు తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో 9మంది తాలిబన్లు అక్కడికక్కడే మరణించారు. జలాలాబాద్ దాడిలో మరో ఇద్దరు మరణించారు. వీరు సాధారణ పౌరులని జిన్హువా వార్త సంస్థ ప్రసారం చేసింది. కాబూల్కు తూర్పు భాగంలో 120కిమీ దూరంలో ఉదయం 6గంటలకు తాలిబన్ ఆత్మాహుతి దళ సభ్యులు నాటో స్థావరాలపై దాడి చేశారు. సెక్యూరిటీ దళాలకు వీరికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. దాడిలో ఆప్ఘన్లు, నాటో సైనికులు ఎంత మంది మరణించింది ఇంకా నిర్ధారణ కాలేదు. కాగా ఒక అప్ఘన్ సైనికుడు మరణించారని పలువురు అమెరికన్ సైనికులు గాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నాటో హెలికాప్టర్లు తీవ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. దాడి జరిగిన చోట పొగ దట్టంగా అలుముకుంది. తాలిబన్ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ ఈ దాడికి తామే కారణమని ప్రకటించారు.