రాజపేట తహశీల్దారు గా రవికుమార్

రాజాపేట, నవంబర్9 ( జనం సాక్షి) :   యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట తహశీల్దారు గా పి.రవికుమార్ బుధవారం బాధ్యత చేపట్టారు. రాజపేటలో తాసిల్దార్ గా పనిచేసిన కె.గిరిధర్ కలెక్టరేట్ కు బదిలీ కాగా వారి స్థానంలో కలెక్టరేట్ నుండి రాజపేట తాహశీల్దారు గా రవికుమార్ బదిలీపై వచ్చారు. గతంలో ఉపతహసిల్దార్ గా రాజపేటలో పని చేసిన అనుభవంతో తహశీల్దారు గా రవికుమార్ రావడంతో మెరుగైన సేవలు అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.