రాజీనామా డ్రామాలతో తెలంగాణను అడ్డుకోలేరు

సీమాంధ్ర నేతల బెదిరింపులపై కేకే ఫైర్‌
హైదరాబాద్‌,జనవరి15 (జనంసాక్షి) :
తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కే.కేశవరావు అన్నారు. రాజీనామా బెదిరింపులతో ప్రత్యేక రాష్టాన్న్రి అడ్డుకోలేరని, గూర్ఖా లాండ్‌ డిమాండ్‌ను తెలంగాణతో పోల్చటం తగదని కేకే అన్నారు. ఈ నెల 28 లోగా తెలంగాణను కేంద్రం ప్రకటిస్తుందని పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్రులు పార్టీనే సవాలు చేస్తూ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా బెదిరింపును ఆయన ఎద్దేవా చేశారు. ఏదైనా ఉంటే చిరంజీవితో మాట్లాడుకోవాలన్నారు. రాజనీమా బెరింపులు చేయడం సరికాదన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న వారు ఇలాంటి వ్యాక్యలు చేయడం తగదన్నారు. ఒకవేళ రాజీనామా చేసినా ఫర్వాలేదన్నారు. ఇలాంటి బెదిరింపులతో తెలంగాణను అడ్డుకోలేరని కొంచెం కఠనం గానే కెకె హెచ్చరించారు.