రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్న ఐకాస నేతలు

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌కు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ ఐకాస నేతలు కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అయన్ను కలిసి తెలంగాణ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే భాజపా బహిరంగ సభలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్‌ హైదరాబాద్‌కు వస్తున్నారు.