రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు

3

హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించు కుని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజర య్యారు. ఆ యనతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆం ధ్రప్రదేశ్‌, తెలంగాణ శా సన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్‌, ఉ ప ము ఖ్యమంత్రి మ

హమూద్‌ అలీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, బీ జేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డితో పాటు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హ రీశ్‌ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీలు జితేందర్‌ రెడ్డి, డీ శ్రీనివాస్‌, ఎమ్మె ల్యేలు, వివిధ పార్టీ నేతలు, రాష్ట్ర హజ్‌ కమిటీ అధికారి, మత పెద్దలు ఈ విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్‌ ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముం దుండాలని  తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా బతకాలని గవ ర్నర్‌ ఆకాంక్షించారు.