రాయబారిగా ఉండాలని నన్నెవరూ అడగలేదు
ముంబై: రియో ఒలింపిక్స్లో భారత బృందానికి సౌహార్థ్ర రాయబారిగా ఉండాలంటూ తనను ఎవరూ సంప్రదించలేదని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తెలిపారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను సౌహార్థ్ర రాయబారిగా నియమించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ) మరింత మందిని ‘రియో’ రాయబారులుగా ఎంచుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మీడియాలో మాత్రమే ఆ వార్తలు వచ్చాయి. ఈ అంశంపై నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ-మెయిల్స్ కూడా రాలేద’ని రెహ్మాన్ చెప్పారు.