రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : వేసవికాలం ప్రారంభ దశలోనే ఎండ తీవ్రత పెరుగుతోంది. శనివారం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా 42 డిగ్రీలకు చేరు కుంది. ఈ ఉష్ణోగ్రతల తవ్రత దృష్ట్యా రాబోవు 24గంటల్లో రాలయసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. రాయలసీమలోని కర్నూలు, కడప అనంతపురం, నంద్యాల్లో అత్యధికంగా 42 డిగ్రీలుగా ప్రాంతంలోని రామగుండం , హన్మకొండ, మహబూబ్‌నగనర్‌ లో 41డిగ్రీలుగా నమోతయ్యాయి.