రాహుల్‌గాంధీని కలిసిన బండా కార్తీకరెడ్డి

ఢిల్లీ: రాహుల్‌ గాంధీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి తెలియజేశారు. కార్తీకరెడ్డి, బండా చంద్రారెడ్డి రాహుల్‌ గాంధీని కలిశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి రాహుల్‌ దృష్టి సారించినట్లు తెలిపారు.