రుద్రహోమం తులసీధాత్రి కళ్యాణం లో పాల్గొన్న జంపన ప్రతాప్

కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి సెప్టెంబర్ 5 జనం సాక్షి బోయినపల్లి లో కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్యఅతిథిగా పాల్గొన్ని శ్రీ వేంకటేశ్వర వేదాంతవర్ధినీ సంస్కృత కళాశాల మరియు పాఠశాల యందు కార్తీక వనభోజనాల సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, రుద్ర హోమం, తులసీధాత్రి కళ్యాణం, సత్యనారాయణ వ్రతం పాల్గొన్నారు, అనంతరం కార్యక్రమములో జంపన ప్రతాప్ ను కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్ సత్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రామనాథం, కిషన్ ,సుబ్రహ్మణ్యం, అనంత ఆచార్యులు , ప్రభాకర్ రామమోహన్ శ్రీధర్ సుందరేశ్వర్ కళాశాల కార్యాలయ సిబ్బంది నీరజ, ప్రవీణ్ , పవన్, సత్యనారాయణ, మరియు విద్యార్థులు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.