రూ.1274 కోట్లు వెనక్కి

3

– తెలంగాణ సర్కారుకు ఊరట

హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి):

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికపరంగా పెద్ద ఊరట లభించింది. గతంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ తీసుకున్న రూ. 1274 కోట్ల మొత్తాన్ని ఆ శాఖ తిరిగి ఇవ్వనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్సైజ్‌ కార్పొరేషన్‌ పన్ను బకాయిల పేరిట ఆదాయం పన్నుశాఖ తెలంగాణకు చెందిన రూ.1274 కోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి మళ్లించుకున్న విషయం తెలిసిందే.దీనిపై కేంద్రంతో పలుమార్లు తెలంగాణ సర్కారు చర్చలు జరిపింది. హైకోర్టు కూడా ఈ విషయంలో కలగజేసుకుంది. అలా తీసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించింది. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను కేవలం ఒక్క రాష్ట్రం నుంచే ఎలా తీసుకుంటారన్నది తెలంగాణ నుంచి వ్యక్తమైన అభ్యంతరం.