రెండు కార్లు ఢీ: వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మే7(జ‌నం సాక్షి):  జిల్లాలోని బాలానగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.