రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

సన్నద్దం అవుతున్న నేతలు
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): వేతనాల పెంపుపై పునర్విమర్శన కోరుతూ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఈ నెల చివరిలో రెండు రోజుల సమ్మెకు దిగే అవకాశం ఉంది. జీతాలు పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) ఒత్తిడి తీసుకుని రాకపోతే ఈ సమ్మెకు దిగుతామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఈఎ) నాయకుడు ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బడా పారిశ్రామిక వేత్తలు ఎగవేసిన కోట్లాది రూపాయిల రుణాలను రైట్‌ ఆఫ్‌ పేరుతో మాఫీ చేశారు. కానీ బ్యాంకు ఉద్యోగుల నిజమైన డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఇది చాలా సిగ్గుచేటు విషయం’ అని ఎఐబిఈఎ ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. వెంకటాచలం విమర్శించారు.
బ్యాంకు ఉద్యోగులు 2017 నవంబర్‌ నెల నుంచి బ్యాంకర్లకు వేతన సవరణ జరపాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శనివారం ముంబయిలో యూఎఫ్బీయూ(బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక), వివిధ బ్యాంకులకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఐబీఏ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. బ్యంకు ఉద్యోగులు ఎక్కువ వేతన పెంపు కావాలని కోరగా ఐబీఏ అందుకు సుముఖంగా లేదు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలను 2? పెంచేందుకు మాత్రమే ఐబీఏ ముందుకొచ్చిందని, గతంలో జరిగిన 15? పెంపు ఒప్పందానికి ఇది విరుద్ధమని వెంకటాచలం విమర్శలు గుప్పించారు.