రెండు రోజుల పాటు జరగనున్న జనతాదళ్‌ సమావేశం

న్యూఢీల్లీ, జనంసాక్షి: జనతాళ్‌ యునైటెడ్‌కు చెందిన అగ్రశ్రేణి నేతల సమావేశం ప్రారంభమయింది. రెండు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాజపాతో పొత్తుపై చర్చించనున్నట్టు తెలియవచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం మధ్య జరుగుతున్న ఈ సమావేశం కీలకప్రాధ్యాతను సంతరించుకుంది. ఈ సమావేశంలో జనతాళ్‌ యునైటెడ్‌కు చెందిన అగ్రనేతలు శరద్‌యాదవ్‌, నితీశ్‌కుమార్‌లతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.