రెండు లారీలు ఢీకొని 5గురి మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం జొన్నాడ వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, సిమెంట్‌ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు కాల్వలోకి పడిపోయాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ 8మందిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాద సమయంలో సిమెంట్‌ లారీలో 13మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.