రేపు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు,గీతా పారాయణం

రేపు ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు,గీతా పారాయణం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 5(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రేపు కార్తీక ఆదివారం సందర్భంగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సామూహిక భగవద్గీత పారాయణం, ఉదయం 11 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.అనంతరం నిత్య విష్ణు పారాయణ కమిటీ వారిచే మధ్యాహ్నం భోజనం వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వివరాలకు 9440981253 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.