రైతులకు ఈ కేవైసీనీ తప్పనిసరి అప్డేట్ చేయించుకోవాలి

జనంసాక్షి   రాజంపేట్
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద జమచేసేందుకు ఈ కేవైసీని తప్పనిసరి  చేసింది కేంద్రం మండల కేంద్రంలోని రైతు వేదిక లో మండల వ్యవసాయ  అధికారి జ్యోత్స్న ప్రియదర్శి మాట్లాడుతూ రైతులకు సహాయంగా పి ఎం కిసాన్ పథకం కింద మూడు విడతలుగా రూ. 6000 జమ చేస్తున్న దృశ్య పీ ఎం కిసాన్  పథకం డబ్బులువచ్చే పతి రైతు  ఈ కేవైసీనీ చేసుకోవాలి ఈ పథకానికి 2019 జనవరి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టా పాసు పుస్తకాలు వచ్చిన రైతులు మాత్రమే అర్హులు అని చెప్పారు.  మండలంలో కొద్ది  మంది రైతులు మాత్రమే చేసుకొన్నారని, మిగిలిన రైతుల ఇంకా ఈకేవైసీని చేసుకోలేదని అని పేర్కొన్నారు.  ఈ పీ. ఎం కిసాన్ ఈకేవైసీని చేసుకోవడానికి ఈ నెల ఆఖరి వరకు అవకాశం ఉంది కాబట్టి  మండల రైతులు  సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. కావున సమీపంలో గల మీసేవ లేదా  వినియోదారుల సేవ కేంద్రం సంప్రదించాలని తెలిపారు.