రైతులకు సంపూర్ణ సహకారం అందించండి.

నూతన చైర్మన్,వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 19, జనం సాక్షి.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నూతనంగా నియమించబడిన తిమ్మక్కపల్లికి చెందిన ఇప్ప లక్ష్మీ , వైస్ చైర్మన్ శ్రీనివాస్, తో పాటు పాలకవర్గం సభ్యులు మెదక్ పార్లమెంటు సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.తమమీద నమ్మకంతో అవకాశం కల్పించినందుకు వారు ఎంపీ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈసందర్భంగా వారిని దౌల్తాబాద్, రాయపోల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి వారికి శాలువా కప్పి ఎంపీ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావని, రైతుల హితమే లక్ష్యం గా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర శర్మ,జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మోహన్ రావు, దయాకర్, దౌల్తాబాద్ ఉప సర్పంచ్ ముత్యం గారి యాదగిరి,నాయకులు నరేష్ గుప్తా,గణేష్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area

తాజావార్తలు