రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

d2wne6nyన్యూఢిల్లీ, ఆగస్టు 5 : మధ్యప్రదేశ్‌లోని మాచక్‌ నది సమీపంలోని కల్వర్టు వద్ద జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ.25 వేలు నష్టపరిహారంగా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు ఈరోజు ఉదయం లోక్‌సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు సంఘటన జరిగిన ప్రాంతంలో చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులకు ఇటార్సీ, ముంబై ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 30కి చేరుకోగా, దాదాపు 300 మంది గాయపడ్డారు. అలాగే రైలు ప్రమాదంపై ముంబై రైల్వే డివిజన్‌ విచారణకు ఆదేశించింది.