రోడ్డు ప్రమాద బాధితులని పరామర్శ

నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్ 28 (జనంసాక్షి)

పెద్ద మందడి మండలం గట్లఖనాపురం తండా కు చెందిన సిరిపాల్ , సంతోష్ లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడారు.