రోడ్డు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌ : కొండాపూర్‌ వద్ద రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 27.5 కోట్ల వ్యయంతో బొటానికల్‌ గార్డెన్‌ నుంచి పాత బొంబాయి హైవే వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు, అధికారులు పాల్గొన్నారు.