లాతూరుకి 10లక్షల లీటర్ల నీళ్లిస్తాం: దిల్లీ సీఎం
దిల్లీ: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న లాతూరు మునుపెన్నడూ లేనంత తీవ్ర కరవుతో అల్లాడిపోతోంది. ప్రజలకు, పశువులకు గుక్కెడు తాగునీరు సైతం కరువైపోయింది. దీంతో సుమారు అయిదు లక్షల లీటర్ల నీటిని రైలు ట్యాంకర్ల ద్వారా తరలించడానికి చర్యలు చేపడుతున్నారు.
మరోపక్క ఈ విషయమై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాతూరు ప్రజలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ‘దిల్లీ తరఫున లాతూరులోని సోదరసోదరీమణులకి రెండు నెలల పాటు రోజుకి 10లక్షల లీటర్ల నీళ్లు ఇస్తాం’ అంటూ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ప్రధాని మోదీకి రాసిన లేఖను పోస్ట్ చేశారు.