లైన్మెన్ నిర్లక్ష్యంతో విద్యుత్తు కాంట్రాక్టు లేబర్ కు కరెంట్ షాక్

లైన్మెన్ నిర్లక్ష్యంతో విద్యుత్తు కాంట్రాక్టు లేబర్ కు కరెంట్ షాక్

జనంసాక్షి,చెన్నరావు పేట

మండలంలోని లింగగిరి శివారులో గల 11 కె.వి లైన్ మరమ్మతులో భాగంగా కరెంటు పోలు ఎక్కి రిపేరు చేస్తున్న క్రమంలో ఎల్ సి తీసుకోవాల్సిన లైన్మెన్ వెంకటేశ్వర్లు, జేఎల్ఎం సురేష్లు నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వలన నెక్కొండ మండలం చంద్రుగొండ మూడు తండా గ్రామానికి చెందిన భూక్య వీరన్న (26) 11 కేవీ లైన్ మరమ్మతు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్కు గురై కరెంటు స్తంభం పై నుంచి కింద పడగా వెంటనే లైన్మెన్ వెంకటేశ్వర్లు జేఎల్ఎం సురేష్లు హనుమకొండలోని అజార హాస్పిటల్కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. బాధితుడికి అమ్మా సరోజ,నాన్న అమృ, భార్య పుష్ప, కుమార్తె ఉన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకొని అతనికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు