లోకాయుక్త ఎదుట హాజరైన అధికారులు

హైదరాబాద్‌ : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి ఎంగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి సుకేశ్‌రెడ్డి లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. చేప మందు పంపిణీని నిలిపివేయాలని ఆరు రోజుల క్రితం లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.