లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. గ్యాస్‌ సిలిండర్ల పరిమితిపై తృణమూల్‌ ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఎఫ్‌డీఐలపై లోక్‌సభలో చర్చను తాము వ్యతిరేకిస్తున్నట్లు సమాజ్‌వాదీ ప్రకటించింది.