వధూవరులను ఆశీర్వాధించిన ఎమ్మెల్యే లు

శివ్వంపేట ఆగస్ట్ 20, జనంసాక్షి : మండల పరిధిలోని కొంతాన్ పల్లి ఎంపీటీసీ ఆకుల ఇందిరా శ్రీనివాస్ కుమారుడు ఉదయ్ కిరణ్ వివాహం చిన్న శంకరంపేట్ జెడ్పిటిసి మాధవి రాజు అన్న కూతురు అఖిలతో జరిగింది. శుక్రవారం రాత్రి కొంపల్లి లోని ఎస్ ఎన్ ఆర్ గార్డెన్ లో  రాత్రి జరిగిన వివాహా విందుకు టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి,  ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, బట్టి జగపతి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు బానోతు రవి నాయక్, పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణా గౌడ్, మాధవరెడ్డి, ఎదుల్లాపూర్  సర్పంచ్ కలూరి కీర్తన హనుమంతరావు, పోతులబోగూడ సర్పంచ్ హరి కిషన్ రావు, దంతాన్ పల్లి సర్పంచ్ దుర్గేశ్, ఉప సర్పంచ్ ములుగు నాగేశ్వరరావు, గుండ్లపల్లి సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్ యాదవ్,  కొంతనపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాటికొండ రాజశేఖర్ గౌడ్, గొర్రె వెంకట్ రెడ్డి, నాయకులు జగన్ రెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీ లతోపాటు సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.