వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలి: కిషన్‌రెడ్డి

రాజమండ్రి: వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. నీలం తుపానుతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించేందుకు తూర్పుగోదావరి జిల్లా తొండంగికి కిషన్‌రెడ్డి చేరుకున్నారు.