వాలీబాల్ కిట్లు ఎస్సై అందజేత

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని క్రీడాకారులకు ఎస్సై రామచంద్రమ్ గౌడ్ వాలీబాల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెలలో జిల్లా లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని దేనికి గాను ముందస్తు క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించినట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ ఉండాలని తమకు ఏ అవసరం ఉన్న నిరభ్యంతరంగా కలవాలని తెలిపారు. క్రీడల పట్ల యువకులు విద్యార్థులు ఆసక్తి చూపలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పురుషోత్తం, వాలీబాల్ ప్లేయర్ బండి భాస్కర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు