విగ్నేశ్వర స్వామి పూజలో పాల్గొన్న కోడి అమరేందర్ కృష్ణవేణి దంపతులు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లోని గోదావరి కాలని,ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్నేశ్వర స్వామి విగ్రహాలను సొంత ఖర్చుతో అందించి విగ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో కోడి అమరేందర్ యాదవ్ కృష్ణవేణి దంపతులు పీటల మీద కూర్చొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అశ్వాపురం మండల ప్రజలు, మల్లెలమడుగు ప్రజలు పాడిపంటలు,వ్యాపారాలలో, సుఖశాంతులతో జీవించేలా ఏకదంతుని దీవెనలు అందాలని కోరారు. సకల శాస్త్రాలకు అధిపతిగా బుద్ధిని సిద్ధిని ప్రసాదించాలని విఘ్నాలు తొలగి అందరికీ శుభం కలగాలని ఏకదంతుణ్ణి ప్రార్థించారు. ప్రకృతి పరిరక్షణకు మట్టి విగ్రహాలని ఉపయోగించి మానవాళి మనుగడకు తమ వంతు సహాయ సహకారాలు అందించే క్రమంలో భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రకృతిని అందించే దిశగా మట్టి గణపతులను అందరూ ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లెలమడుగు గ్రామ పంచాయతీ, వినాయక ఆలయ కమిటీ గ్రామపెద్దలు, మహిళలు, యువకులు,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.