విజయవాడలో కారీరీష్టి యాగం

విజయవాడ: వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధింగా పండేందుకు తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడలో కారీరీష్టి యాగం విజయవాడలో నిర్వహిస్తున్నారు. నగరంలో టీటీడీ కల్యాణమండపం మూడు రోజుల పాటు ఈ యాగం చేస్తారు. ఇప్పటికే తిరుమల, విజయనగరంలో యాగం నిర్వహించామని ఆయా ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని.. రాష్ట్రమంతా బాగా వర్షాలు కురవాలని విజయవాడలోనూ కారీరీష్టి యాగం చేపట్టినట్లు తితిదే  ఈవో ఎల్వీ సుబ్రమణ్యం తెలియజేశారు.