విజయవాడలో కార్ల దొంగల ముఠా అరెస్ట్
విజయవాడ,ఆగస్ట్24 (జనంసాక్షి): భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లను దొంగిలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల ముఠాను డీసీపీ విజయరామారావు విూడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ ముఠా మొత్త 10 కార్లు, 3 మోటార్ వాహనాల చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. తమిళనాడులోని దిండిగా ప్రాంతానికి చెందిన పెరుముల్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ఈ దొపిడీలకు పాల్పడుతున్నారని వివరించారు. చోరీ చేసిన వాహనాలను చెన్నైలో ట్రావెల్స్లో తిప్పేందుకు వీరు ప్లాన్ చేశారని తెలిపారు. నిందితులపై రాష్ట్రంలో పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.19.20 లక్షల విలువ చేసే వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా ముందుగా రెక్కీ చేసిన తరువాత చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.