విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

 మక్తల్ మండలంలోని MPUPS దాసర్ దొడ్డి పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికై మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సౌకర్యాలను కల్పిస్తూ ఉచిత నాణ్యమైన విద్యను, ఉచిత పాఠ్యపుస్తకాలను, ఉచిత ఏకరూప దుస్తులను, రోజువారీగా మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు అని అన్నారు. గ్రామంలోని పెద్దలు తల్లిదండ్రులు యువకులు తమ పిల్లలను పాఠశాలకు సక్రమంగా వచ్చేటట్లు అలాగే అడ్మిషన్స్ పెంపొందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎస్ఎంసి చైర్మన్, గ్రామ పంచాయతీ అధికారిని లతోపాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం రవీందర్ రెడ్డి, విదుర్ కుమార్, రామ్ కిరణ్, మారుతి, వరుణ్ కుమార్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.