విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉపద్రవమే..

శాసన సభ పక్షనేత ఈటెల
లాంతర్లతో తెరాస ప్రదర్శన
హైదరాబాద్‌, జనవరి 06 (జనంసాక్షి):
కరెంటు ఛార్జీలు మరోసారి పెంచితే ఊరుకోబోమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఆదివారంనాడు మీడియాతో మాట్లా డుతూ నిత్యావసరాల ధరలు పెరగడంతోను, బస్సు చార్జీలు పెరగడంతోను ప్రజలు విలవిలలాడుతున్నా రన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచితే విద్యుత్‌ ఉప కేంద్రాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్‌ ఛార్జిల పెంపును విరమించుకోకపోతే అసెంబ్లీ సమావేశాలను సైతం అడ్డుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లే పరిపాలన కుంటుపడుతోందన్నారు. ఛార్జీల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.