విభజన హావిూలపై వివరాలివ్వండి
కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
పొంగులేటి పిటిషన్పై నాలుగువారాల గడువు
న్యూఢిల్లీ,మే7(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంపై దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేసిన వాటి వివరాలు తెలపాలంటూ కేంద్రానికి సుప్రీం ఆదేశించింది. కాంగ్రెస్ ఎంఎల్సి పొంగులేటి సుధాకర్రెడ్డి పిటిషన్పై సుప్రీం విచారించింది. నాలుగేళ్లుగా విభజన సమస్యలను పరిస్కరించలేకపోయారని ఆయన ఫిర్యాదు చేశారు. కేంద్రం ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందని అన్నారు.
దీంతో వివరాల సమర్పణకు కేంద్రం 4 వారాల గడువు కోరింది. దాంతో తదుపరి విచారణను కోర్టు నాల్గు
వారాలకు వాయిదా వేసింది.