విశ్వబ్రహ్మణుల రాష్ఠృ జాయింట్ సెక్రెట్రి అరెస్ట్

లింగంపేట్ 30 జూలై (జనంసాక్షి)
 లింగంపేట్ మండలంలోని భవానిపేట్ షెట్పల్లి గ్రామాలకు చెందిన విశ్వబ్రహ్మణ నాయకులను శనివారం లింగంపేట్ పోలీసులు అరెస్ట్ చేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రహ్మణ జాయింట్ సెక్రెట్రి వడ్ల రామచందర్ మాట్లాడుతు కెసిఆర్ విశ్వబ్రాహ్మణు లకు ఇచ్చిన మాట తప్పడంతో తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ళ బిక్షపతి ఆదేశాల మేరకు శనివారం ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని లింగంపేట్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన దుయ్యబట్టారు.ఉదయం ఐదు గంటలకు తమ గ్రామాల్లోకి పోలీసులు వచ్చి హౌజ్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి మళ్ళి 12 గంటలకు విడుదల చేశారని ఆయన తెలిపారు.అరెస్ట్ అయిన వారు విశ్వబ్రహ్మణ రాష్ఠృ జాయింట్ సెక్రెట్రి వడ్ల రాంచెందర్ లింగంపేట్ మండల అధ్యక్షుడు పండరి ఉన్నారు.