విూరట్లో భారీ అగ్నిప్రమాదం
లక్నో,మే3(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్ లోని విూరట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లిసారి ప్రాంతంలోని స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగి పలు ఇళ్లు దహనమయ్యాయి. గత రాత్రి ఓ ఇంట్లో మొదలైన మంటలు క్రమంగా గుడిసెలన్నింటికీ వ్యాపించాయి. దీంతో కాలనీ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దాదాపు 50కి పైగా ఇళ్లు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. ్గ/ర్ యాక్సిడెంట్ కు సంబంధించి సమాచారం అందుకున్న సిబ్బంది 10 ్గ/రిరజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది.