వెంకటసుబ్బారెడ్డికి బాబు పరామర్శ

కడప,నవంబర్‌27( జనం సాక్షి ): కడప జిల్లా పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు జైలులో ఆ పార్టీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. చిన్న కేసుకే వెంకట సుబ్బారెడ్డిని జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలపై వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులు కూడా అతిగా స్పందిస్తున్నారని.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో వారు శ్రద్ధ చూపాలని హితవు పలికారు. చంద్రబాబు మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సవిూక్షలు నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశర చేశారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన విజయవాడ బయల్దేరారు.