వెంకటాపూర్ లో ఇంటింటి కి ప్రచారం నిర్వహించిన

కాంగ్రెస్ నాయకులు

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 31 టేక్మాల్ మండల పరిధిలోని వెంకటాపూర్ మరియు తాండలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, భక్తులకిషోర్, మండల కో ఆప్షన్ మజార్, మోహన్ రెడ్డి,సేవాలాల్, ఆకులపల్లి పాపయ్య, సాయిలు, ప్రవీణ్, సాయిశేషుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.