వెంకయ్య బెదిరిస్తే పిల్లుల్లా కూర్చున్న టీఆర్ఎస్ ఎంపీలు : మధుయాష్కి
న్యూఢిల్లీ, ఆగస్టు 13 : పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు తీరుపై తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటును స్తంభింపజేస్తాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ ఎంపీలు వెంకయ్యనాయుడు బెదిరిస్తే పిల్లుల్లా కూర్చునున్నారని యెద్దేవా చేశారు. రాజకీయ అవసరాల కోసం ప్రధాని అడుగులకు మడుగులు ఒత్తడం మానుకోవాలని మధుయాష్కి హితవుపలికారు.