వేడుకగా పార్వేట ఉత్సవం

శ్రీవారి ఆలయంలోనే వేడుకల నిర్వహణ
తిరుమల,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు ముగిసిన మరుసటి రోజైన ఆదివారం శ్రీవారి ఆలయంలో విజయదశమి పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. సంక్రాంతి కనుమ పండుగ రోజు కూడా తిరుమలలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.ఈ సందర్బంగా మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేశారు. శ్రీమలయప్పస్వామివారు పంచాయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సు ధరించి పార్వేట ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టిటిడి ఈవోకు ఆలయ మర్యాద ప్రకారం పరివట్టం కట్టారు. కోవిడ్‌-19 నిబంధనల కారణంగా ఆలయంలోని కల్యాణోత్సవ మండపం ఆవరణంలో టిటిడి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏడుకొండలతో పాటు శేషాచలాన్ని తలపించేలా రూపొందించిన నమూనా అడవిలో వివిధ రకాల చెట్లు, రాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వన్యమృగాల బొమ్మలను ఉంచారు. ఈ ప్రాంతంలో స్వామివారు వేటలో పాల్గొన్నారు. అనంతరం విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టి స్వామివారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేశారు. ర్వేట ఉత్సవం అనంతరం ఆలయం వెలుపల ఈవో విూడియాతో మాట్లాడుతూ లోకకల్యాణం, కరోనా నివారణ కోసం శ్రీవారి బ్ర¬్మత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పార్వేట ఉత్సవాన్ని కూడా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించామన్నారు. బ్ర¬్మత్సవాలను విజయవంతం చేసిన జీయర్‌స్వాములకు, అర్చకస్వాములకు, అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు
తెలియజేశారు.