శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

జుక్కల్, జూన్23,(జనం సాక్షి),
శాంతియుత వాతావరణంలో పండుగలను నిర్వహించుకొని మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని బిచ్కుంద సీఐ కృష్ణ అన్నారు. .కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ విజయ్ కొండ సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ..శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రానున్న రోజుల్లో బోనాల, బక్రీద్ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. అవాంతరాలు, అల్లర్లు జరగకుండా కమిటీ పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అల్ల ర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలుతీసుకొంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ తిరుమల్ రెడ్డి, మత పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.