శుక్రవారం మధ్యాహ్నానికే 26కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య మధ్యాహాననికే 26కు చేరింది. ఈరోజు రామగుండంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో అరుగురు, అదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు, వరంగల్‌ జిల్లాలో నలుగురు, నల్గొండ జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ఖమ్మం, విశాఖ, కడప , చిత్తూరు, రంగారెడ్డి, ప్రకాశం, నిజామాబాద్‌ , మెదక్‌ , తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.