శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్14 : రాబోయే ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రెటరీ దుదిల్ల శ్రీధర్ బాబు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వైనాల రాజు పిలుపునిచ్చారు. శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా మల్యాల తిరుపతి, మండల అధికార ప్రతినిధిగా చొప్పరి శేఖర్, మండల కార్యదర్శిగా చాట్ల రాయమల్లు లను శనివారం నూతనంగా నియమించి, వారికి నియామక పత్రాలను అందజేశారు. మండల కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నాయకులను వారి సేవలను రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసే విధంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గార్ల మోహన్, రంగు సత్యనారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శులు సయ్యద్ అన్వర్, బొంపల్లి రాజయ్య తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు