శ్రీ బాలాజీ సూపర్ మార్కెట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా బంపర్ డ్రా

పినవాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): మణుగూరు మండలం అశోక్ నగర్ లోని శ్రీ శివ సాయి బాలాజీ సూపర్ మార్కెట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా  ప్రొప్రైటర్ దోసపాటి  ధర్మారావు బంపర్ డ్రా చీటిని మాస్టర్ దోసపాటి హేమంత్ చేతుల మీదుగా డ్రా తీయగా మొదటి బహుమతి జి ఉదయ్(కూపన్ నెo 410) కి టేబుల్ టాప్ గ్రైండర్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకి సరుకుల పై డిస్కౌంట్ ఇవ్వడం కంటే ఏదైనా బహుమతి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ స్కీమ్ ఏర్పాటు చేశాము. ప్రతి వెయ్యి రూపాయల ఖరీదు పై ఒక కూపన్ ఇవ్వబడుతోంది. మా దగ్గర కొనుగోలు చేసిన సరుకుల గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పి)పై ఐదు శాతం తగ్గింపుతో పాటు బహుమతులు అందజేయబడును. ప్రతి వంద రూపాయల కొనుగోలుకి ఒక పాయింట్ చొప్పున 200 పాయింట్లు వచ్చిన వారికి రూ. 600 విలువ చేసే బహుమతి అందజేయబడును. ఈరోజు డ్రా తీసిన వారిలో రెండవ బహుమతి ఎలక్ట్రికల్ స్టవ్  బాబురావు(కూపన్ నెo455) ,మూడవ బహుమతి ముగ్గురికి రైస్ కుక్కర్స్ ను కే. వెంకన్న (కూపన్ నెo 290)  వి. రాఘవ (కూపన్ నెo 153)  శ్రీనివాసులు(కూపన్ నెo 415) వీటితోపాటు ఐదుగురికి నాన్ స్టిక్ పాన్ కన్సిలేషన్ బహుమతులను అందజేశారు. మా వద్ద నాణ్యమైన సరసమైన ధరలకు సరుకులను సప్లై చేయబడును. శుభకార్యాలకు  డోర్ డెలివరీ సౌకర్యం కలదు. మమ్ములను అన్ని విధాలుగా ప్రోత్సహించిన కస్టమర్లకు రెండో వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.