షిర్డి-హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో చోరీ
ముంబయి : హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్తున్న బస్సుపై దోపిడీ దొంగలు విరుచుకుకపడ్డారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆర్టీసి గరుడ బస్సును ఈ రోజు తెల్లవారుజాము రెండు గంటల సమయంలో మహరాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా భూమ్ వద్ద దుండగులు నిలువరించారు. ప్రమాణీకులను బెదిరించి నాలుగు బ్యాగ్లను ఎత్తుకుపోయినట్లు డ్రైవర్ తెలిపాడు. దుండగులు మరో ప్రైవేటు బస్సును కూడా దోచుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం.