సంఝౌతా పేలుడు కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

న్యూఢిల్లీ: సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ రైలు పేలుడు కేసులో కీలక నిందితుడు రాజేశ్‌ చౌదరిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్‌ చేసింది. 2007లో ఇతను ఈ రైల్లో బాంబులు పెట్టినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఇతన్ని అరెస్ట్‌ చేసిన అధికారులు ఉజ్జయినీ కోర్టులో హాజరుపరచి తమ ఆధీనంలోని తీసుకొన్నారు. ఈ కేసులో ఇప్పటికే కమల్‌చౌహాన్‌, అసీమానంద్‌, లోకేశ్‌ శర్మలను అరెస్ట్‌ చేశారు. 2007 ఫిబ్రవరి 18న ఈ బాంబు పేలుడు జరుగా, 68 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.