సత్యవతమ్మకు ఘన నివాళి

 మండలాధ్యక్షుడు నున్నా రమణ
డోర్నకల్ ఆగస్టు 29 జనం సాక్షి
డోర్నకల్ పరిధి గొల్లచర్ల గ్రామానికి చెందిన తెరాస మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ మాతృమూర్తి కళ్లెపు సత్యవతమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసినదే.దీంతో సోమవారం దశదినకర్మలు నిర్వహించారు.తెరాస మండల అధ్యక్షుడు నున్నా రమణ,పలువురు తెరాస నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సతీష్ అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.దీంతో సోమవారం ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.దూర, సుదూర ప్రాంతాల నుంచి సైతం మిత్రులు, ఆత్మీయులు హాజరయ్యారు.కార్యక్రమంలో చైర్మన్ వీరన్న, కౌన్సిలర్ పోటు జనార్ధన్,న్యాయవాది రమేష్, సొసైటీ చైర్మన్ బిక్షం రెడ్డి,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్న, సమ్మిరెడ్డి,గుగులోతు దేవి శంకర్,బానోతు పాండు నాయక్,గుగులోతు సునీత వీరన్న,ఎంపీటీసీ నున్నా మల్లికార్జున్,కోటి,చిర్ర వీరభద్రం,కడెం ప్రశాంత్,రామనాథం,కొత్త రాంబాబు,రాయల నాగేశ్వరరావు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గుద్దేటి మల్లయ్య,అయోధ్య రామయ్య,నూకల ఉపేందర్,నల్లబోలు శ్రీనివాస్,సోషల్ మీడియా అర్జున్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.