సమయం వచ్చినప్పుడు సత్తా చాటుతాం

3

– కేంద్రానికి మంత్రి ఈటెల హెచ్చరిక

హైదరాబాద్‌  ఆగష్టు 29 (జనంసాక్షి):

హైదరాబాద్‌  తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో ఆచితూచి వ్యవహరిస్తున్నాం సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తామని పేర్కొన్నారు. ఐటీ బకాయిల వ్యవహారంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. సమస్యల పరిష్కరం విషయంలో కేంద్రంతో నిరంతరం పోరాడుతామని తెలిపారు.లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికేతర చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర నిధుల్లో కోత ఉన్నా సంక్షేమ విషయంలో రాజీ పడటం లేదని తేల్చి చెప్పారు. సిబ్బంది జీతభత్యాలు, ఉపకారవేతనాల్లో సమస్యల్ని అధిగమిస్తామన్నారు. తక్కువ వడ్డీకి ఇస్తేనే ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఎవరూ ఎప్పటికీ శాసించలేరు.తెలంగాణ గడ్డపై అన్ని పార్టీల జెండాలు మూతపడ్డాయి. చీప్‌లిక్కర్‌తో ఆదాయాన్ని సంపాదించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.