సముద్ర స్నానంచేస్తూ యువకుడి మృతి

గుంటూరు,నవంబర్‌27( జనం సాక్షి ):  సూర్యలంక సముద్రంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ  ఘటన బుధవారం సూర్యలంక, బాపట్లలో చోటు చేసుకుంది. ఎఎస్సై రామయ్య మాట్లాడుతూ… తెనాలికి చెందిన కొంకిపుడి శ్రీనివాస్‌ (27) బాపట్ల సూర్యలంక తీరంలో మునుగుతూ లోనికి చొచ్చుకుపోతుండగా గమనించిన మెరైన్‌ పోలీసులు వెలుపలికి తెచ్చి వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారని తెలిపారు. మృతుడితోపాటు ప్రదీప్‌ కుమార్‌ (25), కొంకిపూడి రామకోటేశ్వరరావు (26) లనే ఇద్దరు ఉన్నారని వారిని కూడా రక్షించామని ఎఎస్సై రామయ్య వివరించారు.